తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నారు. ఉదయం 7 గంటలకే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఏపీ, తెలంగాణలో సాధారణం కంటే.. రెండు, మూడు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏప్రిల్ ప్రారంభం నుంచి ఎండలు మరింత పెరుగుతాయని హెచ్చరించారు. వేడిమి తీవ్రత ఎక్కువ అవడంతో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.