కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించిన కేసును సోమవారం సుప్రీంకోర్టు విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఇక ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు పలు మలుపులు తిరుగుతోంది. కేసు దర్యాప్తు నివేదికను కోర్టులో సీబీఐ సమర్పించనుంది.