ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు

52చూసినవారు
ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు
విజయవాడను వర్షం వీడడం లేదు. శనివారం కొన్ని గంటల పాటు విజయవాడలో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రకాశం బ్యారేజీకి వరద పెరుగుతూ ఉండడంతో గేట్లను పరిశీలించారు సీఎం చంద్రబాబు. నిపుణుడు కన్నయ్య నాయుడుతో మాట్లాడారు. కౌంటర్ వెయిట్ల వద్ద జరుగుతున్న పనులపై ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్