లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం అక్కడి థేమ్స్ నదిని సందర్శించారు. హైదరాబాద్ లో మూసీ నది పునరుజ్జీవం, నది పరివాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా నదిని, దాని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. నది పాలక మండలి, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అధికారులు, నిపుణులతో దాదాపు మూడు గంటలపాటు చర్చించారు. మూసీ నదిని పునరుజ్జీవింపజేసేందుకు తమ మద్దతు ఉంటుందని పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హామీ ఇచ్చింది.