కొనుగోలు కేంద్రాల్లో లారీల నుంచి ధాన్యం దించే పరిస్థితి లేదు: హరీశ్‌

72చూసినవారు
కొనుగోలు కేంద్రాల్లో లారీల నుంచి ధాన్యం దించే పరిస్థితి లేదు: హరీశ్‌
కొనుగోలు కేంద్రాల్లో లారీల నుంచి ధాన్యం దించే పరిస్థితి లేదని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. లారీ డ్రైవర్లు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారని చెప్పారు. ధాన్యం లోడు దించట్లేదని లారీ డ్రైవర్లు వడ్ల రవాణాకు వెళ్లడం లేదన్నారు. రైతులకు జీలుగు, జనుము విత్తనాలు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. అన్ని రకాల వడ్లకు రూ. 500 బోనస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్లు చెప్పారు. రైతుబంధు డబ్బులను జూన్‌ నెలలోనే వేయాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత పోస్ట్