ఓ విమానం భారీ కుదుపులకు లోనైన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 30 మంది ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం. సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం (SQ321) మే 20న మొత్తం 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో లండన్ నుంచి సింగపూర్కు బయల్దేరింది. మార్గమధ్యలో ఫ్లైట్ తీవ్ర కుదుపులకు లోనుకావడంతో దాన్ని బ్యాంకాక్ విమానాశ్రయానికి మళ్లించారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారని సంస్థ వెల్లడించింది.