కాగితాల ఉండను నోట్లో కుక్కి.. కుమారుడ్ని దారుణంగా చంపిన తండ్రి

63చూసినవారు
కాగితాల ఉండను నోట్లో కుక్కి.. కుమారుడ్ని దారుణంగా చంపిన తండ్రి
మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణం జరిగింది. కాగితాల ఉండను నోట్లో కుక్కి ఊపిరాడకుండా చేసి కన్న కొడుకుని ఓ తండ్రి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఇంట్లో గొడవల వల్ల 59 ఏళ్ల వ్యక్తి, అతడి భార్య విడివిడిగా నివసిస్తున్నారు. 9 ఏళ్ల కుమారుడు తల్లి వద్ద ఉంటున్నాడు. సోమవారం ఆ బాలుడు అదృశ్యమయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు పిఎస్ లో ఫిర్యాదు చేశారు. మంగళవారం బాలుడి తండ్రి ఇంటి సమీపంలో పోలీసులు అతడి మృతదేహాన్ని గుర్తించి బాలుడి తండ్రిని అరెస్ట్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్