ఎమ్మెల్సీ కవిత బెయిల్ మంజూరుకు సుప్రీంకోర్టు మూడు ప్రధానమైన కారణాలు చెప్పింది. సీబీఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేసిందని.. ఈడీ కూడా దర్యాప్తు పూర్తిచేసిందని పేర్కొంది. నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదంది. మహిళగా కూడా పరిగణించాల్సిన ఉందని అభిప్రాయపడింది. అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.