టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత రిషబ్ పంత్ ఎమోషనలయ్యాడు. వరల్డ్కప్ విన్నింగ్ మూమెంట్స్ బాగా ఎంజాయ్ చేశాడు. దాదాపు 16నెలల తర్వాత జట్టులో కమ్బ్యాక్ ఇచ్చిన పంత్ ఈ టోర్నీలో ఆకట్టుకున్నాడు. రోడ్డు ప్రమాదం కారణంగా కొంతకాలం జట్టుకు దూరమైన పంత్, టీమ్ఇండియాలో రీ ఎంట్రీతోనే ఛాంపియన్ అయ్యాడు. ఈ నేపథ్యంలో పంత్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. 'ఇదంతా దేవుడి ప్లాన్' అని వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చాడు.