టీ20 వరల్డ్ కప్తో ఢిల్లీకి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు ప్రధాని మోదీతో భేటీ అనంతరం ముంబైకి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు నారిమన్ పాయింట్ నుంచి ఓపెన్ బస్లో ర్యాలీగా పరేడ్ నిర్వహించనున్నారు. ఆ బస్సును అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. భారత ప్లేయర్లు ఆనందోత్సహాలతో కప్ అందుకున్న పోస్టర్లను బస్సుకు మూడు వైపులా అంటించారు. కాగా దాదాపు 2 గంటల పాటు ర్యాలీ జరుగనుంది.