తనను పెళ్లి చేసుకుంటానని లైంగికంగా వాడుకుని మోసం చేశారని కాదంబరి జెత్వానీ గతేడాది డిసెంబరులో జెఎస్డబ్ల్యూ అధినేత సజ్జన్ జిందాల్పై ముంబైలో కేసు పెట్టింది. పలుకుబడి ఉన్న సజ్జన్ ఏపీలోని వైసీపీ పెద్దల సహాయం కోరారు. దీంతో వైసీపీ పెద్దలు పోలీసుల సహాయంతో ఆ కేసును విత్ డ్రా చేసుకోవాలని నటిని వేధించారు. ఫోర్జరీ డాక్యుమెంట్ ఆధారంగా పెట్టిన దొంగ కేసులో కాదంబరి కుటుంబంపై 10ఏళ్ల శిక్ష పడే సెక్షన్లు నమోదు చేయడం గమనార్హం. సుమారు 40 రోజులపాటు వారు జైలులోనే ఉండే పరిస్థితి కల్పించారు.