హెచ్సీయూలో 2015లో ఏబీవీపీ, అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ వర్సిటీ కుల రాజకీయాలకు, జాతి వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా మారిందంటూ నాటి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. ఆ ఏడాది నవంబరులో వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సిఫారసుతో ఐదుగురు విద్యార్థులపై వీసీ అప్పారావు బహిష్కరణ వేటు వేశారు. 2016 జనవరి 17న రోహిత్ వేముల హాస్టల్ రూమ్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని మరణించాడు.