రైల్వే స్టేషన్లపై బాంబు దాడి చేస్తామంటూ బెదిరింపు (వీడియో)

61చూసినవారు
రాజస్థాన్‌‌లోని పలు రైల్వే స్టేషన్లపై బాంబు దాడులు చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. జైపూర్‌తో సహా ఇతర రైల్వే స్టేషన్‌లకు బుధవారం ఈ బెదిరింపులు వచ్చాయి. హనుమాన్‌ఘర్ జంక్షన్‌‌లోని స్టేషన్ సూపరింటెండెంట్‌కు వచ్చిన లేఖ జైష్-ఎ-మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ పేరుతో బెదిరింపును జారీ చేసింది. దీంతో అదనపు పోలీసు సిబ్బందిని మోహరించి, కట్టుదిట్టమైన నిఘా నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్