బావిలో పడి ముగ్గురు బాలికలు మృతి

60చూసినవారు
బావిలో పడి ముగ్గురు బాలికలు మృతి
గుజరాత్‌లోని పంచమహల్ జిల్లా సిమాలియా గ్రామంలో విషాద ఘటన జరిగింది. బావిలో పడి ఐదేళ్ల చిన్నారితో సహా ముగ్గురు బాలికలు మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. గ్రామంలో నివసించే ముగ్గురు బాలికలు కలిసి అటవీ ప్రాంతంలో పశువులను మేపేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. తొలుత ఓ బాలిక బ్యాలెన్స్ తప్పి బావిలో పడిపోయింది. ఆమెను రక్షించే క్రమంలో మరో ఇద్దరు బాలికలు సైతం బావిలో పడి చనిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్