రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నించిన బీజేపీకి దేశ ప్రజలు తగిన బుద్ధి చెప్పారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. బుధవారం ఆయన కేరళలోని వయనాడ్లో పర్యటించారు. వయనాడ్ సీటును వదులుకోవాలా లేక రాయ్బరేలీని వదులుకోవాలా అనే డైలమాలో ఉన్నట్టు తెలిపారు. ‘మోదీలా నాకు దేవుడి నుంచి మార్గదర్శకత్వం లభించడం లేదు. నేను సామాన్య మానవుడిని. నాకు పేద ప్రజలే దేవుళ్లు. ప్రజలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా’ అని చెప్పారు.