గుజరాత్‌లో భారీ వర్షాలకు ముగ్గురు మృతి

51చూసినవారు
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో గుజరాత్ అతలాకుతలం అవుతుంది. వరదల్లో చిక్కుకుని ముగ్గురు మృతిచెందగా, 20వేల మంది నిరాశ్రయులయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావస కేంద్రాలకు తరలిస్తున్నారు. వాయువ్య మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్‌లో ఏర్పడిన అల్పపీడనంతో ఈనెల 29 వరకు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈనేపథ్యంలో పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

సంబంధిత పోస్ట్