లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నేడు మూడో దశ పోలింగ్ దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. గోవా(2), గుజరాత్(25), చత్తీస్గఢ్(7), కర్నాటక(14), అస్సాం(4), బిహార్(5), మధ్యప్రదేశ్(8), మహారాష్ట్ర(11), యూపీ(10), పశ్చిమ బెంగాల్ లో 4, జమ్మూకాశ్మీర్ లో 1, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూలోని 2 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.