నేపాల్ లో భారీ వర్షాలు.. 20 మంది మృతి

59చూసినవారు
నేపాల్ లో భారీ వర్షాలు.. 20 మంది మృతి
నేపాల్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో కొండచరియలు విరిగిపడటం, పిడుగులు పడటంతో 20 మంది చనిపోయారు. ఖాట్మండుకు పశ్చిమాన 125 కి.మీ దూరంలో ఉన్న లామింగ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో మూడు ఇళ్లు కొట్టుకుపోయాయని, ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు మరణించారని అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా పిడుగుపాటుకు మరో తొమ్మిది మంది మరణించారని, మొత్తం ఇప్పటివరకు 20 మంది చనిపోయినట్లుగా వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్