నేడు జింబాబ్వేతో భారత్ రెండో టీ20

61చూసినవారు
నేడు జింబాబ్వేతో భారత్ రెండో టీ20
జింబాబ్వేతో భారత్ క్రికెట్ జట్టు ఆదివారం రెండో టీ20 ఆడనుంది. హరారేలో సాయంత్రం 4.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) మ్యాచ్ ప్రారంభం కానుంది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి టీ20లో భారత్ ఓటమి పాలైంది. సీనియర్లు లేకుండా ఆడుతున్న తొలి సిరీస్ కావడంతో టీమిండియా యువ ఆటగాళ్లు తడబడ్డారు. ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్ భారత్ గెలిచి తీరాలనే పట్టుదలతో ఆడనుంది.

సంబంధిత పోస్ట్