సార్వత్రిక ఎన్నికల్లో రెండో విడతకు రంగం సిద్ధమైంది. మొత్తం 13 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 ఎంపీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు పోలింగ్ నిర్వహిస్తారు. రెండో దశలో భాగంగా కేరళలో 20, కర్ణాటకలో 14, రాజస్థాన్లో 13, మహారాష్ట్రలో 8, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 6, అసోం, బిహార్లలో 5 చొప్పున ఛత్తీస్గఢ్, పశ్చిమబెంగాల్లలో 3 చొప్పున, మణిపూర్, త్రిపుర, జమ్మూకశ్మీర్లలో ఒక్కో స్థానంలో ఎన్నికలు జరగనున్నాయి.