తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా, శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 73,051 మంది భక్తులు దర్శించుకోగా.. 34,599 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.92 కోట్లు సమకూరింది.