టోల్‌ప్లాజాల పన్నుల ధరలు పెరిగాయి

68చూసినవారు
టోల్‌ప్లాజాల పన్నుల ధరలు పెరిగాయి
హైదరాబాద్-విజయవాడ హైవేపై పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్‌ప్లాజాల వద్ద పెరిగిన పన్ను రుసుములు అమల్లోకి వచ్చాయి. కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒక వైపుకు ₹5, రానూపోనూ కలిపి ₹10, భారీ రవాణా వాహనాలకు ₹35, ₹50 చొప్పున పెంచారు. 2025 మార్చి 31 వరకు పెరిగిన ధరలు అమల్లో ఉంటాయి. పంతంగి వద్ద కారు ఒకవైపు ధర రూ.95, రానూపోనూ రూ.145, కొర్లపహాడ్ వద్ద రూ.130, రూ.195, చిల్లకల్లు వద్ద రూ.110, రూ.160గా ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్