పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆ ఎఫెక్ట్ కూరగాయలపై పడింది. దేశ రాజధాని ఢిల్లీలో టమాటా ధర రూ.80 దాటగా, బెండకాయ ధర రూ.100 దాటింది. మరోవైపు కోల్కతా మార్కెట్లో నిత్యావసర ధరలు రిటైల్ కంటే ఎక్కువ పలుకుతున్నాయి. కోల్కతాలో టమాటా కిలో రూ.80-100 వరకు పెరిగాయి. వంకాయలు కిలో ఏకంగా రూ.110-140కి విక్రయిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా బెంగళూరు, హిమాచల్ప్రదేశ్ నుంచి టమాటాల సరఫరా తగ్గడమే ఇందుకు కారణం.