టీ20 ప్రపంచకప్ ముగింపు దశకు వచ్చేసింది. ఫైనలిస్టులు ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోకుండా రావడం ఇదే తొలిసారి. టీ20 కప్ చరిత్రలోనే మొదటిసారిగా దక్షిణాఫ్రికా ఫైనల్కు చేరుకోగా.. రెండో కప్ను నెగ్గాలనే పట్టుదలతో ఉన్న భారత్ ముంగిట 17 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికే అవకాశం నిలిచింది. ఇరు జట్ల మధ్య శనివారం ఫైనల్ జరగనుంది.