టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్ తన సహచరులకు హెచ్చరికలు జారీ చేశాడు. ‘‘మేం ఏం చేయాలనేదానిపై మాకు స్పష్టత ఉంది. మా చివరి మ్యాచ్లో తప్పకుండా విజయం సాధించాలి. అయితే, భారత్ వంటి పెద్ద జట్టుతో తలపడనున్నాం. ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా సెమీస్ అవకాశాలు గల్లంతు అవుతాయి. చివరి మ్యాచ్లో గెలవడంపైనే ఇక దృష్టిపెడతాం’’ అని మార్ష్ వ్యాఖ్యానించాడు.