AP: అమెరికాలోని టెక్సాస్లో దుండగుల కాల్పుల్లో బాపట్ల యువకుడు దాసరి గోపీకృష్ణ మృతి చెందడంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గోపీకృష్ణ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గోపీకృష్ణ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్'లో పోస్ట్ పెట్టారు.