లోక్సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో పోలింగ్ శాతం పెంచేందుకు ముంబైలో పలు వ్యాపార సంస్థలు ఓటర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించాయి. ఓటు హక్కు వినియోగించుకున్న తమ కస్టమర్లకు జర్నీలో 10 డిస్కౌంట్ ఇస్తామని ముంబై మెట్రో తెలిపింది. అలాగే నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్
ఇండియా (NRAI) ముంబై విభాగం ‘డెమోక్రసీ డిస్కౌంట్’ పేరుతో ఓటర్లకు 20 శాతం తగ్గింపు ప్రకటించింది.