ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. జవాన్ మ‌ృతి

58చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. జవాన్ మ‌ృతి
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో స్పెషల్‌ ఫోర్స్‌ అధికారులు యాంటీ నక్సల్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. అడవిలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో వారికి మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు, మావోల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల ఘటనలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్ మృతి చెందగా.. మరో జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్