బతుకమ్మ పండుగ వేడుకల్లో విషాదం.. విద్యుత్ లైట్లు తగిలి వ్యక్తి మృతి (వీడియో)

53చూసినవారు
వరంగల్ జిల్లాలో విషాదం జరిగింది. నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామంలో బతుకమ్మ వేడుకల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి గురువారం రాత్రి చీకటి యాకయ్య (45) అనే వ్యక్తి మృతి చెందాడు. యాకయ్య చేతిలో బాబు ఉండగా.. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. విద్యుత్ లైట్లు కింద నుండి వెళ్తుండగా.. లైట్లకు ఉన్న వైర్లను తగిలి ప్రమాదం జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కారు డాష్ క్యామ్‌లో రికార్డ్ అయ్యాయి.

సంబంధిత పోస్ట్