చేప మందు పంపిణీలో విషాదం.. వ్యక్తి మృతి

15682చూసినవారు
చేప మందు పంపిణీలో విషాదం.. వ్యక్తి మృతి
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. క్యూ లైన్లో నిలబడ్డ ఓ వ్యక్తి తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే అక్కడి వారు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు నిజామాబాద్ జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్