బీచ్‌లో తీవ్ర విషాదం.. ముగ్గురు మృతి

52చూసినవారు
బీచ్‌లో తీవ్ర విషాదం.. ముగ్గురు మృతి
ఏపీలోని బాపట్ల జిల్లా చీరాల మండలం రామాపురం బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో స్నానానికి వెళ్లి గల్లంతైన నలుగురు విద్యార్థులో ముగ్గురు మృతి చెందారు. మరో విద్యార్థి కోసం గాలిస్తున్నారు. మృతులు నితిన్, అమలరాజు, తేజగా గుర్తించారు. గల్లంతైన విద్యార్థి కిషోర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతులు ఏలూరు జిల్లాకు చెందిన వారిగా తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్