'ఇందిరమ్మ' ఇళ్ల నిర్మాణ మేస్త్రీలకు శిక్షణ

52చూసినవారు
'ఇందిరమ్మ' ఇళ్ల నిర్మాణ మేస్త్రీలకు శిక్షణ
TG: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మేస్త్రీలదే కీలక పాత్ర కానుండటంతో వారి శిక్షణపై గృహ నిర్మాణ శాఖ దృష్టిపెట్టింది. రాష్ట్రంలోని 12,672 గ్రామాల నుంచి ఒక్కో మేస్త్రీని ఎంపిక చేసి.. వారికి శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ శిక్షణకు ఒక్కో మేస్త్రీకి రూ.8,500ఖర్చు చేయనున్నారు. ఈ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 చొప్పున భరించనున్నాయి. HYDలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో ప్రస్తుతం 7 జిల్లాల పరిధిలో 82మందికి మొదటి బృందంలో శిక్షణ పూర్తిచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్