కర్ణాటక రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించాలని బీజేపీ కుట్ర పన్నుతున్నట్లు రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. హుబ్బళ్లిలోని తన కళాశాల ఆవరణలో నగర కౌన్సిలర్ కుమార్తె హత్యకు గురికావడంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించడంపై ఆయన స్పందించారు. కర్ణాటకలో అత్యుత్తమ శాంతిభద్రతలు ఉన్నాయన్నారు. ఈ కేసులో నిందితుడు ఫయాజ్ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.