నిన్న సీఎస్కేతో మ్యాచ్లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్లో 50+ స్కోరును అత్యధిక సార్లు చేసిన వికెట్ కీపర్గా రాహుల్ చరిత్రకెక్కాడు. ఐపీఎల్లో 50+ స్కోరును రాహుల్ 25 సార్లు సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు ఎంఎస్ ధోనీ పేరిట ఉండేది. ధోనీ 24 హాఫ్సెంచరీలు బాదాడు. రాహుల్, ధోనీ తర్వాతి స్థానాల్లో డికాక్ (23), దినేశ్ కార్తీక్ (21), రాబిన్ ఊతప్ప (18) ఉన్నారు.