గాజాలోని రఫా సిటీపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ‘ALL EYES ON RAFAH’ ఫొటోను ఇన్స్టా స్టోరీలో షేర్ చేసిన రోహిత్ శర్మ భార్య రితికాను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కశ్మీర్ పండిట్లపై దాడి, మణిపుర్లో హింస, పాక్, బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరిగినప్పుడు ఎప్పుడైనా మాట్లాడారా? అంటూ ప్రశ్నించారు. ట్రెండ్ను ఫాలో అవుతూ పోస్టులు చేయడం సరికాదని విమర్శించారు. దీంతో ఆమె ఆ స్టోరీని తొలగించారు.