సోషల్ మీడియా మోజులో పడి చాలామంది తమ కుటుంబాలను పట్టించుకోవడం లేదు. నెట్టింట్లో వచ్చే లైక్స్, కామెంట్ల కోసం.. కుటుంబ సభ్యులతో, ఆత్మీయులతో గొడవలు పడేందుకు కూడా సిద్ధమవుతున్నారు. కొందరైతే దాడి చేయడానికి, చివరికి హత్య చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. బిహార్ బెగుసరైలో ఒక మహిళ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయొద్దని చెప్పినందుకు కుటుంబ సభ్యులతో కలిసి భర్తని అతి కిరాతకంగా హతమార్చింది.