తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న రెండు గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం పేర్కొంది. మహబూబ్ నగర్, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వాన పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది.