ఉత్తరప్రదేశ్లోని బదౌన్లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడు తమ గ్రామానికే చెందిన వివాహితను ప్రేమించాడు. వీరి మధ్య సాన్నిహిత్యం ఆ మహిళ భర్తకు తెలిసింది. వారిద్దరినీ భర్త రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాడు. అనంతరం గ్రామంలో పంచాయతీ పెట్టారు. పెద్దల తీర్పు ప్రకారం ఆ యువకుడికి బలవంతంగా మలం తినిపించారు. మూత్రం తాగించారు. ముఖానికి నల్లని రంగు పూసి, చెప్పుల దండలు వేసి గ్రామంలో ఊరేగించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.