నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అనర్హులకు పాస్ పోర్టులు జారీ చేసిన కేసులో మరో ముగ్గురిని సీఐడీ అరెస్ట్ చేసింది. ఆదిలాబాద్ పాస్పోర్ట్ సేవా కేంద్రంలో పని చేసే ప్రణబ్, ఎస్బీ ఏఎస్ఐ లక్ష్మణ్తో పాటు మరొకరు అరెస్టయ్యారు. మరో పాస్పోర్టు ఏజెంట్ను ముంబైలో సీఐడీ అదుపులోకి తీసుకుంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేశారు.