జార్ఖండ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ ఇద్దరిని అరెస్ట్ చేసింది. ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్తో పాటు ఆయన ఇంటి పనిమనిషి జహంగీర్ ఆలంను కూడా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాంచీలో 10 ప్రదేశాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. జహంగీర్ ఆలం ఇంట్లో రూ.35.23 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.