పిడుగుపాటుకు ఇద్దరు మృతి.. ఒకరి పరిస్థితి విషమం

30277చూసినవారు
పిడుగుపాటుకు ఇద్దరు మృతి.. ఒకరి పరిస్థితి విషమం
తెలంగాణలోని సంగారెడ్డి, మెదక్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. పెద్దశంకరంపేట మండలంలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. రామోజీపల్లి శివారులో వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పిడుగుపడటంతో శ్రీరాములు(45), శివరాజు(15) మరణించారు. అటు ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గిమ్మలో పిడుగుపడి ఐదుగురికి గాయాలు అయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్