కాంగ్రెస్‌ పార్టీకి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల రాజీనామా

33862చూసినవారు
కాంగ్రెస్‌ పార్టీకి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల రాజీనామా
ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు నీరజ్‌ బసోయ, నసేబ్‌ సింగ్‌ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు వారి రాజీనామా లేఖలను విడివిడిగా పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేకు పంపించారు. లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీలో ఆప్‌తో పొత్తుపెట్టుకోవడం నచ్చకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వారు తమ రాజీనామా లేఖల్లో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్