యూపీలోని సహరాన్పూర్లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. పట్టణానికి చెందిన 14 ఏళ్ల బాలిక జ్వాలాపూర్కు చెందిన 15 ఏళ్ల బాలికతో ప్రేమలో పడింది. ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయి బుధవారం పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, తమకు పెళ్లి చేయాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. చివరికి కౌన్సెలింగ్ చేసిన తర్వాత వారిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.