అమెరికాలో జరిగిన ఓ ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి చెందాడు. మృతుడిని వెంకట రమణ పిట్టల (27)గా గుర్తించారు. అతడు ఇండియానా పోలీస్లోని పర్డ్యూ యూనివర్శిటీలో హెల్త్ ఇన్ఫర్మాటిక్స్లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. మార్చి 9వ తేదీన విస్టిరీయా ద్వీపం వద్ద ఈ ప్రమాదం జరిగింది. వెంకట రమణ యమహా పర్సనల్ వాటర్క్రాఫ్ట్ (జెట్స్కీ)ను అద్దెకు తీసుకొన్నాడు. ఆ తర్వాత అక్కడి ఫ్లోటింగ్ ప్లేగ్రౌండ్లో వాడాడు. అదే సమయంలో మరో జెట్స్కీ వేగంగా ఢీకొనడంతో వెంకట రమణ ప్రాణాలు కోల్పోయాడు.