కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలును నిబంధనలకు విరుద్దంగా నడిపినందుకు లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ను రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు. వేగ పరిమితిని ఉల్లంఘించి రైలును నడపడం వల్ల వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేశారని వారిపై చర్యలు తీసుకున్నారు. రైల్వే ట్రాక్ మరమ్మతులు, రైల్వే వంతెన పాతది కావడం, స్టేషన్ యార్డ్ పునర్నిర్మాణం జరుగుతుండటంతో ఆగ్రా రైల్వే డివిజన్లోని మధుర రైల్వే సెక్షన్లో స్పీడ్ కంట్రోల్ విధించారు.