స్కాట్లాండ్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

570చూసినవారు
స్కాట్లాండ్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రమాదవశాత్తూ నీటిలో జారిపడి మృతి చెందారు. ఈ విషాదకర ఘటన స్కాట్లాండ్‌లో చోటు చేసుకుంది. జితేంద్రనాథ్ కరుటూరి (26), చాణక్య బొలిశెట్టి (22) స్కాట్లాండ్‌లోని డూండీ యూనివర్సిటీ మాస్టర్స్ చదువుతున్నారు. భారత స్నేహితులతో కలిసి ‘లిన్ ఆఫ్ తమ్మెల్’కు వెళ్లారు. రెండు నదులు కలిసే ఈ ప్రాంతంలో వీరు ట్రెక్కింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ జారీ నీటిలో పడి మృతి చెందారు.

సంబంధిత పోస్ట్