KA పాల్ నామినేషన్ దాఖలు..ఆయన ఆస్తి ఎంతంటే?

1072చూసినవారు
KA పాల్ నామినేషన్ దాఖలు..ఆయన ఆస్తి ఎంతంటే?
విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే కేఏ పాల్ పేరిట ఆస్తులు చాలా తక్కువ ఉన్నాయి. ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. మొత్తంగా రూ.1.86 లక్షల సొమ్ము మాత్రమే ఉంది. వాహనాలు, స్థిరాస్తులు, రుణాలు లేవు. దీంతో పాల్ ఆస్తి మరీ ఇంత తక్కువా..? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా తాజాగా ఎన్నికల సంఘం ఆయన పార్టీకి కుండ గుర్తును కేటాయించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్