ఏపీ సీఈఓ కీలక సూచనలు

32640చూసినవారు
ఏపీ సీఈఓ కీలక సూచనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) ముకేష్ కుమార్ మీనా ప్రభుత్వ ఉద్యోగులకు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ అయిన తర్వాత ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఆయన స్పష్టం చేశారు. సీనియర్ అధికారులపై ఎక్కువ ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈసీ దీనిపై దృష్టి సారించినట్లు తెలిపారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్