ఇండిగో ఎయిర్లైన్స్లో ప్రయాణించిన భారత పారా అథ్లెట్ సువర్ణ రాజ్కు చేదు అనుభవం ఎదురైంది. నిన్న న్యూఢిల్లీ నుంచి చెన్నైకి విమానంలో వెళ్తుండగా ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బంది తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు.
విమానం డోర్ వద్ద ఉన్న తన పర్సనల్ వీల్ చైర్ కావాలని సిబ్బందిని 10 సార్లు అడిగినా కూడా వారు పట్టించుకోలేదని తన అనుభవాన్ని మీడియాకు వెల్లడించారు.