కన్వర్ యాత్ర నేమ్‌ప్లేట్ల వ్యవహారంపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

81చూసినవారు
కన్వర్ యాత్ర నేమ్‌ప్లేట్ల వ్యవహారంపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
కన్వర్ యాత్ర సాగే రూట్‌లో దుకాణాల నేమ్‌బోర్డులపై యజమానుల పేర్లు ఉండాలని యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. ఈ వ్యవహరంపై విపక్షాలు యోగి సర్కార్‌పై విరుచుకుపడుతుండగా.. తాజాగా ఆర్జేడీ ఎంపీ, కేంద్ర మంత్రి జయంత్‌ చౌదరి కూడా ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. సమాజంలో శాంతి, సామరస్యం దెబ్బతినేలా ఇలాంటి నిర్ణయం తీసుకోరాదని, కన్వర్ యాత్రకు వెళ్లే ప్రజలు, వారికి సేవలు అందించే వారంతా ఒక్కటేనని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్